Header Banner

ప్రతి ఆరు నెలలకోసారి సర్వేలు.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు!

  Sun Jun 08, 2025 12:32        Politics

ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నా. మంచి చేస్తే ప్రోత్సహిస్తా. అవకాశాలు కల్పిస్తా. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా. అవసరమైతే వదులుకుంటా.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. తప్పులు చేసే వారి విషయంలో రాజీ పడబోనని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఏ ఒక్కరి వల్లైనా వ్యవస్థకు నష్టం జరుగుతుందనుకుంటే అంగీకరించేది లేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఏడాది పాలనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొందరు బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా అతి విశ్వాసానికి పోతే వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు వన్‌టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. కొందరు వన్‌టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోతామని అనుకుంటే అది.. వారిష్టం’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ చరిత్రలో తొలిసారిగా! ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు!

మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పనితీరుతో ప్రజలకు దగ్గరయ్యారని చంద్రబాబు తెలిపారు. వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. ఒకరిద్దరి ప్రవర్తన కారణంగా అక్కడక్కడా నష్టం జరుగుతోందన్నారు. ఒకరి కోసం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే అలాంటి నేతలను దూరంగా పెట్టడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో పాలనలో తప్పుల వల్ల, అధికారుల తీరు వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ‘‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మంచిచెడులు తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలి. పనిచేస్తున్న వారికి ప్రమోషన్‌ ఉంటుంది. పనిచేయని వారి విషయంలో 1995 నాటి విధానం అమలు చేస్తా.’’ అని స్పష్టం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు నిర్వహించి స్థానిక పరిస్థితులపై చర్చిస్తానని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: బార్లకు భారీగా దరఖాస్తులు! ఎంపిక ప్రక్రియ ఎలాగంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #chandrababu #politics #tdp #accountability #progress